Rohit Sharma: టీమ్ ఇండియన్ కెప్టెన్ ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి అయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ వార్తలు రావడంతో అభిమానులు కాస్త కంగారు వ్యక్తం చేశారు. అయితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ తాను రిటైర్మెంట్ చేయబోతున్నాను అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు.
తాను ఏ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించలేదు అంటూ ఈయన క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈయన ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారు ఒక మ్యాచ్ ఆడితే తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో కెప్టెన్ రోహిత్ శర్మ A+ గ్రేడ్ ఆటగాడు కావడంతో దీని ప్రకారం ఆయనకు రెమ్యూనరేషన్ అనేది ఒప్పందం కుదుర్చుకొని ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం రోహిత్ శర్మ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల జీతం అందుకుంటారు ఇక మ్యాచ్ల విషయానికి వస్తే…
టెస్ట్ మ్యాచ్ కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ. 3 లక్షల తీసుకుంటారు. వీటితోపాటు ఐపీఎల్ నుండి 16 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో మ్యాచ్ కు ఒక విధంగా రెమ్యూనరేషన్ అందుకుంటారు. ఇకపోతే ఈయన ఆస్తులు విలువ ఎంత అనే విషయానికి వస్తే రోహిత్ శర్మ నికర విలువ ఆస్తి దాదాపుగా రూ.214 కోట్లు ఉంటుందని సమాచారం.
క్రికెట్ ద్వారా రోహిత్ శర్మ సంవత్సరానికి 23 కోట్ల రూపాయల ఆదాయం పొందుతారు. ఇవి కాకుండా ఈయన పలు కంపెనీలకు బ్రాండ్ ఎండార్స్మెంట్ చేస్తూ మరో రెండు కోట్ల వరకు అదనంగా పొందుతున్నారు. వీటితో పాటు ఈయన అనేక స్టార్టప్లలో దాదాపు రూ.90 కోట్లు పెట్టుబడి పెట్టాడు.ముంబైలో క్రిక్ కింగ్డమ్ అనే క్రికెట్ అకాడమీని కూడా నడుపుతున్నాడు. వీటితో పటు ముంబైలో 30 కోట్ల విలువ చేసే ఇల్లు,రేంజ్ రోవర్ HSE LWB వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.
Latest Videos:
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…