దర్శకధీరుడు రాజమౌళి తీసే సినిమాలకు కథ అందించేది అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్..అయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించినా అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ప్రస్తుతం RRR సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదలకానుంది. ఈనేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ల లో బిజీ బిజీగా గడుపుతున్నారు. RRR మేకర్స్.. విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆశక్తికర విషయాలు చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.
ఒక జర్నలిస్ట్ కులాల ప్రస్తావన తెస్తూ.. ఎన్టీఆర్ కమ్మ కులం.. రామ్ చరణ్ కాపు కులమని ఇలా కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయ తెరంగేట్రం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిచారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 1966లో తనకు పెళ్లి అయిందని.. తనది కమ్మ కులమని.. కానీ తన భార్య కులమెంటో తనకు అప్పుడు తెలియదని చెప్పారు. ఆసమయంలో తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పెళ్లి సమయంలో ఆమె కులం ఏంటి అన్నది తనను ఎప్పుడూ అడగలేదని.. అసలు ఆ విషయమే తనకు తెలియదని చెప్పారు.
అయితే ఖైదీ సినిమా రిలీజ్ అయిన సమయంలో తను మా చిరంజీవి.. మా చిరంజీవి అని తను అనేదని.. అన్నారు. ఆమె అన్ని సార్లు అలా అంటుండటంతో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగేసా.. “మాట్లాడితే మా చిరంజీవి అంటావ్ ఎందుకు” అని.. అప్పుడు ఆమే “మా ఇద్దరిదీ ఒకటే కులం” అని తన భార్య చెప్పిందని.. అందుకే మా చిరంజీవి అంటుందని తెలుసుకున్నానన్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవి వలెనే తన భార్య కులం తనకి తెలిసిందని చెప్పారు విజయేంద్రప్రసాద్.
ఇక తమ కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లు ఎక్కువగా జరిగాయని.. మా ఇంట్లో అమ్మాయిలు కూడా ఇతర కులాల వారిని పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మా కుటుంబంలో ఎప్పుడూ కులాల ప్రస్తావన ఉండదని అలాంటిది కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది అసలు జరిగే చాన్స్ లేదని తేల్చి చెప్పారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…