Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ మెగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. అనంతరం తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి వసూలు రాబట్టింది.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయిధరమ్ తేజ్ బ్రో విజయయాత్ర అంటూ మూడు రోజులపాటు పలు ప్రాంతాలలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విజయ యాత్రకు భారీ స్పందన వచ్చింది. ఇకపోతే ఈ యాత్ర ముగిసిన అనంతరం సాయి ధరంతేజ్ అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్టులో భాగంగా సాయిధరమ్ తేజ తనకు భయమేస్తుంది అంటూ కామెంట్ చేయడం కమనార్హం.
ఇందులో భాగంగా సాయిధరమ్ స్పందిస్తూ బ్రో సినిమా విజయయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ యాత్రలో భాగంగా మీరు చూపించిన అభిమానం సినిమా గురించి మీరు చెప్పిన వ్యాఖ్యలు అందరిని చాలా సంతోషానికి గురి చేశాయని తెలిపారు. అయితే ఈ యాత్రలో భాగంగా చాలామంది అభిమానులు నన్ను కలవడానికి నాతో సెల్ఫీలు దిగడానికి వచ్చారు వారందరికీ నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు అయితే ఈ యాత్రలో భాగంగా చాలా మంది బైక్ పై ర్యాలీ చేస్తూ సెల్ఫీలు వీడియోలు దిగే ప్రయత్నం చేశారు.
ఇక ఈ విజయ యాత్రలో భాగంగా బైక్ పై వస్తున్నటువంటి అభిమానులు ఎవరూ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. మిమ్మల్ని అలాంటి పరిస్థితులలో చూస్తే నాకు చాలా భయం వేస్తుందని తెలిపారు. మీరు నా అభిమానులు మాత్రమే కాదు నా బ్రోస్ అంటూ ఈయన తెలిపారు. మీకు ఏదైనా జరిగితే నేను మానసికంగా ఎంతో కృంగిపోతాను దయచేసి బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఉద్దేశించి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…