సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతడి ఆరోగ్య విషయమై ప్రతీ గంట గంటకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అయితే అతడికి ఆదివారం సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు, పరిశ్రమ వర్గాలు, బంధువులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ప్రస్తుతం అతడు నడిపిన స్పోర్ట్స్ బైక్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. అతడు డ్రైవ్ చేసిన ఆ బైక్ సాయిధరమ్ తేజ్ పేరు మీద లేదు.
అనిల్ కుమార్ బురా అనే వ్యక్తి పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. అయితే దానిని ఆ మెగా హీరో కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ లో అతడు కొనుగోలు చేశాడని.. రిజిస్ట్రేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా ఆ బైక్ ను నడుపుతున్న సమయంలో మితిమీరిన వేగంతో వెళ్లడంతో ఆ బైక్ పై చలాన్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మెగా హీరో బైక్ పెండింగ్ చలాన్ ను నందమూరి అభిమాని క్లియర్ చేశాడని తెలిసింది. ఇప్పడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అతడి బైక్ ఉన్న పెండింగ్ చాలనాను నందమూరి అభిమాని చెల్లిండం ఏంటని.. ఏదేమైనా నందరమూరి-మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధానికి ఇదొక నిదర్శనం అంటూ చాలామంది ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…