సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతడి ఆరోగ్య విషయమై ప్రతీ గంట గంటకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అయితే అతడికి ఆదివారం సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు, పరిశ్రమ వర్గాలు, బంధువులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ప్రస్తుతం అతడు నడిపిన స్పోర్ట్స్ బైక్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. అతడు డ్రైవ్ చేసిన ఆ బైక్ సాయిధరమ్ తేజ్ పేరు మీద లేదు.
అనిల్ కుమార్ బురా అనే వ్యక్తి పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. అయితే దానిని ఆ మెగా హీరో కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ లో అతడు కొనుగోలు చేశాడని.. రిజిస్ట్రేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా ఆ బైక్ ను నడుపుతున్న సమయంలో మితిమీరిన వేగంతో వెళ్లడంతో ఆ బైక్ పై చలాన్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మెగా హీరో బైక్ పెండింగ్ చలాన్ ను నందమూరి అభిమాని క్లియర్ చేశాడని తెలిసింది. ఇప్పడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అతడి బైక్ ఉన్న పెండింగ్ చాలనాను నందమూరి అభిమాని చెల్లిండం ఏంటని.. ఏదేమైనా నందరమూరి-మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధానికి ఇదొక నిదర్శనం అంటూ చాలామంది ప్రశంసిస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…