Sai Madhav Burra : రాణా సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీ కంట్లో పడిన బుర్రా సాయి మాధవ్ ఆ తరువాత వచ్చిన శర్వానంద్ సినిమా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా డైలాగలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఆ తరువాత పెద్ద సినిమాలతో వెను తిరిగి చూసుకోలేదు సాయి మాధవ్. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలకు అలానే పెద్ద దర్శకుల సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీ అయిపోయారు. తన సినిమా కెరీర్ గురించి పలు విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు మాధవ్.

వీర సింహా రెడ్డి డైలాగులు అలా ఉంటాయి…
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న వీర సింహా రెడ్డి సినిమాకు డైలాగులు సాయి మాధవ్ బుర్ర రాశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన దాదాపు అన్ని హిట్ సినిమాలకు డైలాగులు అందించారు. ఇక వీర సింహా రెడ్డి గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో డైలాగులు అనగానే బాలయ్య బాబు గుర్తొస్తారు. ఆయన సినిమాలో డైలాగులకు ఫేమ్ ఎక్కువ, ఇక ఈ సినిమాలో కూడా అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా అలానే క్యారెక్టర్ ను దాటి పోకుండా డైలాగులు రాసినట్టు సాయి మాధవ్ తెలియపారు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు తగిన గుర్తింపు రాలేదన్న వాదన అపద్దం అంటూ తెలిపారు. తెలుగులో సినిమా డైలాగులకు మంచి గుర్తింలో వచ్చిందని, అవార్డులు కూడ వచ్చాయని అయినా ప్రేకక్షకులు గుర్తిస్తే అదే చాలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతి సినిమాకు పనిచేసినా ఆ సినిమా గురించి అలోచించి ఆ హీరోకు తగ్గట్టు డైలాగులు రాయడానికి ప్రయత్నిస్తానని తెలియపారు సాయి మాధవ్ బుర్ర.































