Saidharam Tej: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి సినిమా ప్రమోషన్ల సమయంలో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు,హీరో సంయుక్త మీనంతో పాటు సాయి ధరమ్ తేజ్ సైతం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
ఈ ప్రోమోలో భాగంగా సాయిధరమ్ తేజ్ యాంకర్ సౌమ్యరావు పై సెటైర్లు వేస్తూ ఆమె పరువు మొత్తం తీశారు. ఈ కార్యక్రమంలో సౌమ్యరావు చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై కనిపించడంతో ఆమెను చూస్తున్నటువంటి సాయి ధరంతేజ్.. ఏంజెల్ ఇలా చీర కట్టుకొని రావడం మొదటిసారి చూస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
సాయి ధరంతేజ్ ఇలా కామెంట్ చేయడంతో యాంకర్ సౌమ్యరావు తెగ సిగ్గుపడుతూ మురిసిపోయింది. అయితే వెంటనే సాయి ధరమ్ తేజ్ నేను అన్నది మిమ్మల్ని కాదు అంటూ పంచ్ వేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడంతో సౌమ్య రావు మొఖం చిన్న బుచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…