Saidharam Tej: సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను వెల్లడించారు.తాను ప్రమాదానికి గురై ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించాలని ఈయన క్షమాపణలు చెప్పారు..
ఇలా ప్రమాదం తర్వాత తాను స్పృహలోకి వచ్చినప్పుడు మొదటగా తన తల్లిని తన తమ్ముడిని చూసానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.అయితే ఆ సమయంలో వారికి సారీ చెప్పాలని చూసిన నాకు మాటలు రాలేదని ఒక బాధ ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో అప్పుడే తనకు అర్థమైందని తెలిపారు. ఎలాగైనా తిరిగి మీ ముందుకు రావాలి మీ ప్రేమను పొందాలన్నా లక్ష్యంతో తాను మీ ముందుకు వచ్చానని తెలిపారు.
లక్ష్యం సాధించడం కోసం మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరు వెనక్కి తగ్గకూడదని మన లక్ష్యాన్ని చేదించి తల్లిదండ్రులు గురువులు గర్వపడేలా చేయాలని ఈయన తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఈయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…