Saidharam Tej: సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను వెల్లడించారు.తాను ప్రమాదానికి గురై ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించాలని ఈయన క్షమాపణలు చెప్పారు..
ఇలా ప్రమాదం తర్వాత తాను స్పృహలోకి వచ్చినప్పుడు మొదటగా తన తల్లిని తన తమ్ముడిని చూసానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.అయితే ఆ సమయంలో వారికి సారీ చెప్పాలని చూసిన నాకు మాటలు రాలేదని ఒక బాధ ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో అప్పుడే తనకు అర్థమైందని తెలిపారు. ఎలాగైనా తిరిగి మీ ముందుకు రావాలి మీ ప్రేమను పొందాలన్నా లక్ష్యంతో తాను మీ ముందుకు వచ్చానని తెలిపారు.

Saidharam Tej: హెల్మెట్ తప్పనిసరి….
లక్ష్యం సాధించడం కోసం మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరు వెనక్కి తగ్గకూడదని మన లక్ష్యాన్ని చేదించి తల్లిదండ్రులు గురువులు గర్వపడేలా చేయాలని ఈయన తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఈయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























