Prashanth Neel: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన మొదట ఉగ్రం అనే సినిమాకు దర్శకుడుగా పనిచేశారు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయినటువంటి ప్రశాంత్ అనంతరం కే జి ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయింది.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ పనులను కూడా జరుపుకోవాలని ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు.
ఇక ఈయన మొదట దర్శకత్వం వహించిన ఉగ్రం సినిమా విడుదలై 10 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఈయన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే నన్ను ఫాలో అయ్యి ఇండస్ట్రీలోకి రావద్దని తెలిపారు. నేను డైరెక్టర్గా ఉగ్రం సినిమాకు పని చేయడానికంటే ముందు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు ఒక షార్ట్ ఫిలిం కూడా తీయలేదని తెలిపారు.
నాలుగు సంవత్సరాలు..
ఇలా ఎక్కడ పని చేయకుండా డైరెక్టర్గా రావడంతో తాను ఆరు నెలలలో చేయాల్సిన సినిమాని నాలుగు సంవత్సరాలు చేశానని దీంతో నిర్మాతలతో పాటు నేను కూడా అధిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అందుకే ఎవరు కూడా ఈ విషయంలో తనని ఫాలో అయ్యి తప్పు చేయొద్దని ప్రశాంత్ నీల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…