Samantha : నిత్యం ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలిచే హీరోయిన్ సమంత. దక్షిణాదిన అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న సమంత అందరు అగ్రహీరోలతోను నటించింది. ఇక ఇపుడు కుర్రహీరోలతోను నటించడానికి సిద్ధం అంటోంది. ఈ మధ్యనే కన్మని రాంబో ఖాతిజ సినిమాతో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన సమంత ప్రస్తుతం వరుస సినిమా లతో బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన సమంత తాజాగా విజయ్ దేవరకొండతో సినిమా చేయనుంది.
రెమ్యూనరేషన్ పెంచిన సమంత…..

ఇక ఖుషిగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాశ్మీర్ యువకుడిగా, సమంత తమిళ అమ్మాయిగా కనిపించనున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమాకు మజిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లోనే జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమా కోసం సమంత పారితోషకం ఇపుడు హాట్ టాపిక్ అయింది.
సమంత ఈ సినిమా కోసం 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. సాధారణంగా సమంత ఒక సినిమాకు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే పాన్ ఇండియా సినిమా అవ్వడం ఇక తనకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉండడంతో 5 కోట్లు డిమాండ్ చేస్తోందట. ఇక సంత తన తదుపరి ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా చిత్రాలే. ఈమధ్య విడుదలైన పుష్ప సినిమా లో ఊ అంటావా మావా పాటతో ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే అన్నారని సమాచారం.





























