Samantha: నాగచైతన్య సమంత పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు రాగా, తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ టాక్ షోలో అసలు విషయాలు చెబుతూ తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.ఇకపోతే వివాహమైన తర్వాత వీరిద్దరూ ప్రముఖ నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుక్కొని అక్కడే ఉండేవారని ఇదివరకు ఇంటర్వ్యూలో మురళీమోహన్ వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్ సమంత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమంత నాగచైతన్య వివాహమైన తర్వాత మా ఇంటిని కొనుక్కొని ఇక్కడే ఉన్నారు.ఈ ఇంటిలో ఉంటూ వారిద్దరూ కలిసి ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఒక కొత్త ఇంటిని కొన్నారు. అయితే ఆ సమయంలోనే ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మారు. ఇకపోతే వాళ్లు కొన్న ఇల్లు రీ మోడలింగ్ చేసేవరకు అదే ఇంట్లో ఉంటామని ఓనర్ వాళ్ళను ఒప్పించి అక్కడే ఉన్నారని మురళీమోహన్ తెలిపారు.
ఇక సమంత నాగచైతన్య కొన్న ఇల్లు రీ మోడలింగ్ పూర్తి కాకుండానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.ఇకపోతే సమంత తను ఉండడం కోసం సిటీలో ఎన్నో చోట్ల ఇంటి కోసం తిరిగినప్పటికీ తనకు ఎక్కడ ఇలాంటి ఇల్లు దొరకకపోవడంతో తిరిగి తన వద్దకు వచ్చి ఆ ఇల్లు కావాలని అడిగినట్లు మురళీమోహన్ తెలిపారు.
అప్పటికే సమంత నాగచైతన్య ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మడంతో వాళ్లతో మాట్లాడి మరింత ఎక్కువ డబ్బు చెల్లించి తిరిగి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారని మురళీమోహన్ వెల్లడించారు.ఇలా ఈ ఇంటిలో తనకు ఎంతో సేఫ్టీ గా ఉంటుందని, సెక్యూరిటీ పరంగా అదే మంచి ఇల్లు అనీ నిర్ణయించుకున్న సమంత అదనపు డబ్బులు చెల్లించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితో కలిసి అక్కడే నివసిస్తున్నారని మురళీమోహన్ ఈ సందర్భంగా ఆ ఇంటి గురించి తెలిపారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…