టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్న సమంత నాగ చైతన్య వ్యక్తిగత కారణాల వల్ల వారి వైవాహిక జీవితం గురించి కీలకమైన నిర్ణయం తీసుకుని వారి వివాహ బంధం నుంచి విడిపోయారు.ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత దంపతులు అక్టోబర్ 2వ తేదీ వీరి విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే విడాకుల తర్వాత సమంత ఏ విధమైనటువంటి పోస్టులు చేయకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే సమంత విడాకులు తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన పేరు మార్చుకున్న సమంత తాజాగా మరొక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సందర్భంగా సమంత తెలియజేస్తూ… ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ముందుగా నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. మధ్యాహ్నం వరకు పడుకొని మనం చేయాలనుకుంటున్నా పనుల గురించి కలలు కనకూడదు.. బద్ధకం వదిలి ముందుకు నడవాలి తనని తానే రక్షించుకోవాలి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఇకపై తన బాధ్యతలను చూసుకోవాలని ఒంటరిగా జీవితంతో పోరాడటానికి ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…