నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతకు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నారు. అక్టోబర్ 2, 2021 న విడాకుల ప్రకటనను వెల్లడించారు. 6 నెలల్లో అంటే.. ఏప్రిల్ వరకు వీరికి విడాకులు మంజూరు అవుతాయని తెలుస్తోంది.
ఇక విడాలకుల ప్రకటన చేసి దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆ విషయం హాట్ టాపిక్ గానే మారింది. ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో కారణం మాత్రం చెప్పలేదు. చాలామంది సమంతను తప్పుపడుతూ వార్తలు కూడా వచ్చాయి.
ఇప్పటికీ కూడా కొందరు ఆమెని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సమంతపై ఓ నెటిజన్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. సమంత డైవోర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని.. ఓ మంచి వ్యక్తి నుంచి రూ.50 కోట్ల ట్యాక్స్ ఫ్రీ డబ్బును దోచేసిందని.. ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు సమంత స్పందించి.. రిప్లై ఇచ్చింది. అందుకే ఈ ట్వీట్ పెద్ద వైరల్ గా మారింది.
సాధారణంగా సమంతపై నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆమె ఈ కామెంట్ కు స్పందించడంతో.. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సదరు నెటిజన్ పేరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘గాడ్ బ్లెస్ యువర్ సోల్’ అని పేర్కొంది. దీంతో ఈ కామెంట్ వైరల్ గా మారగా.. ఇటువంటి వాటికి సమంత స్పందించాల్సిన అవసరం ఏముందంటూ.. సమంత అభిమానులు సపోర్ట్ గా మాట్లాడారు. ఈ మధ్యే ఆమె పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే ప్రత్యేక సాంగ్లో నటించి అలరించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…