Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె మయూసైటిస్ వ్యాధి బారిన పడటంతో సినిమా షూటింగులకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.
ఇలా ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు విషయాలను తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఈమె నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలియజేశారు. ఇక విడాకులు అనంతరం తప్పు మొత్తం సమంతది అంటూ పెద్ద ఎత్తున తనపై ట్రోల్స్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ట్రోల్స్ గురించి సమంత స్పందిస్తూ…
అవి నా జీవితంలో చీకటి రోజులు పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని కోరుకున్నాను. ఆ సమయంలో నా మనసుకు నచ్చిన విధంగా రియాక్ట్ అయ్యాను. ధైర్యంతో ముందడుగు వేశాను. ఆ సమయంలో నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో అండగా నిలిచారు. ఇక ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నాను అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంత మేలు అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…