Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోల నుండి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ సమంత కలిసి పని చేసింది. ఇప్పటికీ అందరితోనూ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటుంది. అయితే సమంతకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు మాత్రం వీళ్లెవ్వరూ ముందుకు రావడం లేదు. .టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా సమంతకి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే హీరోలు మాత్రం ఎవ్వరు స్పందించడం లేదు.
మన టాలీవుడ్ హీరోలు సమంతని దూరం పెడుతున్నారా? అందుకే ఆమెకి బర్త్డే విషెస్ చెబుతూ పోస్టులు చేయటం లేదా అని అందరిలో అనుమానం కలుగుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా కాకుండా సమంతకి పర్సనల్ గా ఫోన్ చేసి విషెస్ చెప్పి ఉండవచ్చు కదా అని కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
సమంత బర్త్ డే స్పెషల్గా ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్ను విడుదల చేస్తూ మైత్రీ సంస్థ ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ ఆమెకి స్పెషల్ విషెస్ తెలియజేయగా దర్శకుడు శివ నిర్వాణ కూడా సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా సమంతకి బర్తడే విషెస్ తెలియజేశాడు. అయితే ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి మన హీరోలు సమంతకు విషెస్ చెబుతారా? లేదా? అన్నది చూడాలి.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…