ఏ మాయ చేసావే సినిమా ద్వారా మొట్ట మొదటి సారి తెరపై సందడి చేసిన చైతన్య సమంత ఆ తరువాత పలు సినిమాలలో నటించి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి 2017లో పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ జంటగా నిలిచిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.గత కొద్ది రోజుల నుంచి వీరి గురించి వస్తున్న వార్తలు నిజమేనని నేడు నాగచైతన్య విడాకుల విషయం గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన అనంతరం సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సమంత తన స్టోరీలో.. నేను ఎంతో బాధ నిస్పృహలో ఉన్న సమయంలో నాకు ఒక విషయం అర్థం అయింది. చివరికి ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు దుర్మార్గులు, హంతకులు, నమ్మకద్రోహులు ఉంటారు. వెన్నుపోటు పొడుస్తూ ఎవరికీ తెలియకుండా ఉండటంలో వారికి వారే నిపుణులు. ఇలాంటి వారు చివరికి నాశనం అవుతారు. చరిత్ర కూడా ఇదే చెబుతుంది. ఈ విషయాన్ని నాకు మా అమ్మ చెప్పింది అంటూ తన స్టోరీస్ ని ముగించారు.
ఈ విధంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎంతో ఎమోషనల్ గా బాధపడుతూ పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విడాకుల తర్వాత తన తల్లి చెప్పిన విషయాలను సమంత పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదిఏమైనప్పటికీ సమంత నాగ చైతన్యల వివాహ బంధంలో విడిపోవడం అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…