కోర్టులో తేల్చుకుంటా..! సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..!

అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య ఏమి నడుస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. విడాకుల విషయమై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. వాటిపై వారిద్దరిలో ఒక్కరూ కూడా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో విచిత్రమైన, విభిన్నమైన పోస్టులు పెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోవడం లేదు.

రోజు రోజుకూ రూమర్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల నాగచైతన్య ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత విషయాలను అడగొద్దని కండీషన్ కూడా పెట్టారు. దీంతో అనుమానాలకు ఇంకా బలం చేకూరినట్లు అయింది. ఇటీవల అలాంటి రూమర్స్ ను నమ్మను అని.. తన తల్లిదండ్రులు ఇలాగే పెంచారని చెప్పిన నాగచైతన్య అంతలోనే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అభిమానుల్లోనే గందరగోళ పరిస్థితి ఉండగా.. అటు సినీ పరిశ్రమలో కూడా వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇదిలా ఉండగా.. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకునేందుకు సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నారంటూ తెలుస్తోంది.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సమంత తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల దేవస్థానం వద్ద కూడా ఓ రిపోర్టర్ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న అడిగితే.. గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి బుద్ది ఉందా అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలు ఇక మీడియాలో రాకుండా ఏం చేయాలనే సలహాలు తన లీగల్ టీం సభ్యుల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారం.