Featured

విద్యార్థులకు గుడ్ న్యూస్.. అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే పరీక్ష..!

కేంద్ర విద్యాశాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశాలను కల్పించబోతుంది. కేంద్ర విద్యాశాఖలో కార్యదర్శి హోదాలో పని చేసే అమిత్‌ఖరే స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. విద్యారంగంలో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతేడాది కేంద్రం నూతన విద్యావిధానం–2020ను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కేంద్రం హైయర్ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సహాయంతో ఉన్నత విద్యా విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొనిరావాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండగా ప్రస్తుతం వేటికి అవే ఎంట్రన్స్ పరీక్షకలను నిర్వహించుకుంటున్నాయి. ఇలా వేర్వేరుగా నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వమే పరీక్షలను నిర్వహించి సీట్లను భర్తీ చేయబోతుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులకు నీట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సులకు కూడా ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో ప్రతిపాదన చేసింది. అయితే చాలా రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనకు అంగీకారం తెలపలేదు. ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఇకపై రాష్ట్రాలు ఎంసెట్ పరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. అయితే నిపుణులు సైతం ఈ విధానం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.

ఒక్కో రాష్ట్రంలో కాలేజీల్లో సీట్ల భర్తీకి ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయని అందువల్ల దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం మాత్రం ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణ ద్వారా ఫీజుల భారం తగ్గుతుందని చెబుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago