Featured

‘పునీత్ దూరమైనా ప్రపంచాన్ని చూస్తారు..’ అతని నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు!

కన్నడ పవర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచారు. పునీత్ మరణించాడన్న వార్త తెలియడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక గొప్ప నటుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో పలువురు నటీనటులు ఈయన మృతి పట్ల స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిజానికి పునీత్ కన్నడ నటుడు అయినప్పటికీ ఈయనకి తెలుగు నటీనటులతో ఎంతో మంచి అనుబంధం.

ఇక ప్రస్తుతం కన్నడనాట పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ ను తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అదేవిధంగా ఈయనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహబంధం ఉందని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పునీత్ మరణించాడన్న వార్త పై ఎన్టీఆర్ స్పందిస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

ఇలా గుండెపోటుతో పునీత్ మరణించడంతో ఆయన కళ్లను దానం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మన మధ్య లేకపోయినప్పటికి అతని కళ్ళు మాత్రం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాయి.ఇదిలా ఉండగా పునీత్ మరణించిన తర్వాత ఆయన కళ్ళను దానం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గతంలో పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ మరణించినప్పుడు కూడా తన తండ్రి నేత్రాలను దానం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago