Sandeep Kishan: ఫుట్ పాత్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించి జీవనోపాధిని వెతుక్కున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు ఎగబడ్డారు అయితే జనాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా రావటం గమనార్హం.
ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో పాపులర్ అవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈమె ఫుడ్ టెస్ట్ చేసేవారు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పోలీసులు ఈమె బిజినెస్ పట్ల చర్యలు తీసుకున్నారు. ఏకంగా తన బిజినెస్ క్లోజ్ చేయించారు.
ట్రాఫిక్ జామ్ అనేది పేరు మాత్రమేనని ఈమె ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటంతోనే ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయింది అనే వాదన కూడా తెరపైకి వచ్చింది ఏది ఏమైనా జీవనోపాధి కోసం ఫుట్ పాత్ పై ఫుడ్ విక్రయిస్తూ జీవనం గడుపుతున్నటువంటి ఈమె బిజినెస్ క్లోజ్ కావడంతో ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ఈమెకు మద్దతుగా నిలిచారు.
ఎందరికోస్ఫూర్తి….
గత కొద్ది రోజుల క్రితం సందీప్ కిషన్ కుమారి ఆంటీ వద్దకు వెళ్లి ఆమె ఫుడ్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం సరైంది కాదని తెలిపారు. ఎంతోమంది మహిళలకు ఆమె స్పూర్తిగా నిలిచారని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన సాధికారత మహిళలలో కుమారి ఆంటీ కూడా ఒకరని తెలిపారు. వీలైనంతవరకు నేను నా టీం తో కలిసి తనకు సహాయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…