సంఘవి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్టిర స్తానాన్ని సంపాదించుకున్న ఒకప్పటి నటి. శ్రీకాంత్ హీరోగా నటించిన “తాజ్ మహల్” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో “సింధూరం” సినిమాలో అమాయక యువతిగా నటించి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఆ తరువాత “ఆహా”, “సూర్యవంశం”, “సీతారామరాజు”, “మృగరాజు”, “సమరసింహారెడ్డి” ఇలా సుమారు ఒక నలభైకి పైగా సినిమాల్లో నటించింది.
పదిహేను ఏళ్లకు పైగా కొనసాగిన ఆమె కెరియర్ లో తెలుగుతో పాటు అనేక భాషల్లో నటించి అలరించింది. తెలుగులో చివరగా 2004 లో “ఆంధ్రావాలా” సినిమాలో నటించింది. ఆ తరువాత “ఒక్కడే కాని ఇద్దరు” అనే సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ తరువాత మరే సినిమాలోను నటించలేదు. అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2016 లో వెంకటేష్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 39 సంవత్సరాలు. అయితే తాజగా ఒక పాపకి జన్మనిచింది. తన బిడ్డతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. అయితే 42ఏళ్ల వయసులో బిడ్డకు తల్లికావడంతో అభిమానులు కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నా… తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…