Sanjay Dutt: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంజయ్ దత్ గురించి అందరికీ సుపరిచితమే.ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన క్యాన్సర్ బారిన పడి ఈ ప్రాణాంతకరమైన వ్యాధి నుంచి బయటపడినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. కాన్సర్ కు చికిత్స ఉన్నప్పటికీ ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడటం అంత సులువైన విషయం కాదని డాక్టర్లు చెబుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సంజయ్ దత్ కుటుంబంలో చాలామంది క్యాన్సర్ బారిన పడి మరణించారు. సంజయ్ తల్లి అలాగే తన మొదటి భార్య కూడా ఈ క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఈయన కూడా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ బ్రతికి బయటపడ్డానని తెలియజేశారు. తనకొక రోజు వెన్నులో నొప్పి అధికంగా ఉండడంతో హాస్పిటల్ కి వెళ్ళానని ఆ సమయంలో తన వెంట తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరని తెలిపారు.
ఇలా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కొన్ని పరీక్షలు చేసి ఒక వ్యక్తి వచ్చి మీకు క్యాన్సర్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యాధి ఉందని తెలియగానే తాను ట్రీట్మెంట్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాధికి కీమోతెరపి తీసుకోవడం ఎంతో కఠినంగా ఉంటుంది. ఈ కీమోతెరపి తీసుకోవడం కన్నా చనిపోవడమే మంచిదని భావించాను.
ఇక తన రెండో భార్య మాన్యత తన కుటుంబ సభ్యుల బలవంతంతో తాను కీమోతేరపీ చేయించుకున్నానని కీమోథెరపీ కారణంగా తాను ఈ మహమ్మారి నుంచి కోలుకొని బయటపడ్డానని తెలిపారు. ఏదో ప్రాణాంతకరమైన ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా బయటపడవచ్చు అలా తాను కూడా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడి అనంతరం కేజిఎఫ్2 సినిమా పూర్తి చేశానని ఈ సందర్భంగా సంజయ్ దత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…