Sanjay Dutt: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంజయ్ దత్ గురించి అందరికీ సుపరిచితమే.ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన క్యాన్సర్ బారిన పడి ఈ ప్రాణాంతకరమైన వ్యాధి నుంచి బయటపడినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. కాన్సర్ కు చికిత్స ఉన్నప్పటికీ ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడటం అంత సులువైన విషయం కాదని డాక్టర్లు చెబుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సంజయ్ దత్ కుటుంబంలో చాలామంది క్యాన్సర్ బారిన పడి మరణించారు. సంజయ్ తల్లి అలాగే తన మొదటి భార్య కూడా ఈ క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఈయన కూడా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ బ్రతికి బయటపడ్డానని తెలియజేశారు. తనకొక రోజు వెన్నులో నొప్పి అధికంగా ఉండడంతో హాస్పిటల్ కి వెళ్ళానని ఆ సమయంలో తన వెంట తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరని తెలిపారు.
ఇలా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కొన్ని పరీక్షలు చేసి ఒక వ్యక్తి వచ్చి మీకు క్యాన్సర్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యాధి ఉందని తెలియగానే తాను ట్రీట్మెంట్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాధికి కీమోతెరపి తీసుకోవడం ఎంతో కఠినంగా ఉంటుంది. ఈ కీమోతెరపి తీసుకోవడం కన్నా చనిపోవడమే మంచిదని భావించాను.

Sanjay Dutt: ప్రాణాంతకర వ్యాధితో పోరాడి బయటపడ్డాను…
ఇక తన రెండో భార్య మాన్యత తన కుటుంబ సభ్యుల బలవంతంతో తాను కీమోతేరపీ చేయించుకున్నానని కీమోథెరపీ కారణంగా తాను ఈ మహమ్మారి నుంచి కోలుకొని బయటపడ్డానని తెలిపారు. ఏదో ప్రాణాంతకరమైన ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా బయటపడవచ్చు అలా తాను కూడా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడి అనంతరం కేజిఎఫ్2 సినిమా పూర్తి చేశానని ఈ సందర్భంగా సంజయ్ దత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


































