Savithri : హీరోలకు ధీటుగా నటించి, ఒక దశలో హీరోలే ఆమెతో నటించాలంటే జాగ్రత్త పడేంతగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి మహానటి సావిత్రి. అంతటి నటికి ఒక అవార్డు రాలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. సావిత్రికి అవార్డులంటే ఇష్టం లేదా.. అయినా ఏం పర్వాలేదు ఎవరో ఇచ్చే అవార్డులు ఆమె నటనకు కొలమానం కాదు. జనం ఆమెను మహానటి అంటూ అన్నిటికంటే గొప్ప అవార్డు ఇచ్చేసారు. సావిత్రి గారి నటన గురించి మాట్లాడితే దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు గార్లు కూడా ఆమెతో పాటు నటించేటపుడు జాగ్రత్త పడేవారట. ఒకానొక సందర్బంలో సావిత్రి తో నటించాలంటే ఒక్కోసారి భయం వేస్తుంది, ఆమెతో నటించడం గొప్ప అనుభవం అంటూ ఎన్టీఆర్, ఎస్వి రంగారావు వంటి వారే చెప్పడం ఆమె నటన ఏ రేంజ్లో ఉంటుందో తెలుపుటకు ఉదాహరణ.
మరణించేటపుడు చెప్పిన ఆఖరి కోరిక…
అంత గొప్పగా నటించి పేరు తెచ్చుకున్న సావిత్రి జీవితంలో చివరి దశల్లో చాలా ఇబ్బందులు అనుభవించి మరణించింది. ఎంతో మందికి గుప్త దానాలు చేసిన సావిత్రి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరణించారు. అయితే ఆమె మరణించే ముందు ఆమె చివరి కోరిక చెప్పింది. ఆమె చివరగా నటించిన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందింది. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం. చాలా మంది వర్ధమాన నటీమణులకు జీవితం ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పించే గుణపాఠం.
తాను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించిందట. మరణంలోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరొచ్చినా కూడా సానుభూతితో తమ కన్నీళ్ళని విడవనక్కర్లేదు. ఈ ఇండస్ట్రీలో కూడా ఎవరూ హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు చిహ్నంగా ఒక పూమాలను ఉంచండి…. ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం అని సావిత్రి అన్నారట. ఆమె చివరగా నటించిన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందింది. అలా సమాధి మీద ఏం రాయాలో మరణించే ముంది సావిత్రి గారు చెప్పి తన మహోన్నత వ్యక్తిత్వాన్ని మరోసారి చాటి చెప్పారు. ఇక ఈ విషయాలను ప్రముఖ సినిమా విమర్శకుడు నందగోపాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించాడు.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…