Senior Analist Adusumilli Srinivasarao : నీకేమైనా బుద్ధుందా… ఇలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడొచ్చా… లక్ష్మి పార్వతి చేసిన వాఖ్యల మీద సీనియర్ అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు ఫైర్…!

Senior Analist Adusumilli Srinivasarao : నందమూరి తారకరత్న మరణించాక ఆయన మరణానికి కారణం లోకేష్ పాదయాత్ర అంటూ విమర్శిస్తున్న వాళ్లలో లక్ష్మీపార్వతి ఒకరు. నిజానికి తారకరత్న లోకేష్ పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టిన ఆరోజే జనవరి 27న మరణించినా చంద్రబాబు దాచిపెట్టి తారకరత్న ను హాస్పిటల్ చికిత్స పేరుతో ఉంచి ఇప్పుడు మరణించాడని బయటికి చెప్పారంటూ ఒకవైపు వినిపిస్తున్నా వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా తారకరత్న హాస్పిటల్ లో ఉన్నపుడు వెళ్లి పరామర్శించడం మీడియా ముందు కోలుకొంటాడు అంటూ మాట్లాడటం జరిగింది. అయితే తారకరత్న మరణించి ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే ఇలాంటి చర్చలేమిటి అనే వాదన ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ఛాన్స్ వస్తే విమర్శించడానికి రెడీ గా ఉండే లక్ష్మి పార్వతి గారు తారకరత్న మరణం గురించి మీడియాతో మాట్లాడారు. ఆ రోజు నా భర్త ఈరోజు నా మనవడు చంద్రబాబు, లోకేష్ స్వార్థంకు బలయ్యారు. నా కుటుంబంలో తీరని విషాదనికి కారణం వాళ్లే, ఇంకెంతమంది వారి వల్ల బలవ్వాలో అంటూ విమర్శించారు.

నా కుటుంబం అనుకుంటే ఇలా మాట్లాడవు…

లక్ష్మి పార్వతి చేసిన వాఖ్యలకు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఫైర్ అయ్యారు. నా కుటుంబం అని ఆమె నిజంగానే అనుకుని ఉంటే మీడియా ముందుకు వచ్చి చనిపోయిన వ్యక్తిగత గురించి రాజకీయం చేయదు. పుట్టెడు దుఃఖంలో కుటుంబం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదు అంటూ అభిప్రాయపడ్డారు. ఇలాగే లక్ష్మి పార్వతి ఛాన్స్ దొరికినప్పుడల్లా నందమూరి కుటుంబం గురించి మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఊరికే ఉన్నట్లు నా లాంటి వాళ్ళు ఊరికే ఉండరు. ఈమె మొదటి భర్త, వారికి పుట్టినరోజు కొడుకు గురించి వెతికి మరి ఆయన ఎక్కడున్నాడో వెళ్లి నీ కుటుంబం గురించి మాట్లాడుతాం. పెంట కుప్పలో రాయి వేసినట్లుగా ఉండే ఈమె ప్రవర్తన వల్లే చంద్రబాబు ఈమె ఏం మాట్లాడినా మౌనంగా వదిలేసాడు. అదే ఆయన చేసిన తప్పు.

ఇప్పుడు నా భర్త అని చెప్పుకునే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కి వ్యతిరేకమైన పార్టీ పంచన చేరి నందమూరి కుటుంబ పరువు తీస్తోంది. నందమూరి వంటి పచ్చని కుటుంబానికి పట్టిన చీడ ఈ లక్ష్మి పార్వతి అంటూ ఘాటు వాఖ్యలు చేసారు. మీడియా వాళ్ళు కూడా ఈమెతో విలువైన పర్సన్ అన్నట్లుగా ఆమె మూతి ముందదు మైకు పెడతారు. కుటుంబం అనుకుంటే సానుభూతి తెలపాలి కానీ రాజకీయాలు చేయకూడదు. నీలాగే విజయసాయి రెడ్డి చేసాడా, అతను వెళ్లి చూసి వచ్చి చెప్పాడు కాదా చికిత్స జరుగుతోందని మరి ఆ మాట సంగతి ఏమిటి అంటూ లక్ష్మీపార్వతి మీద ఫైర్ అయ్యారు అడుసుమిల్లి శ్రీనివాసరావు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago