Featured

Senior Journalist Bhardwaja : వాణి జయరాం ముఖం మీద గాయాలు… పోస్టుమార్టం రిపోర్టులో ఏం తెలిసిందంటే…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ప్రముఖ గాయని వాణి జయరాం అనుమానాస్పద స్థితిలో ఆమె ఇంట్లోనే మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె మరణం సహజమరణం కాదు అని ఎవరో హత్య చేసారు అనే పుకార్లు బాగా వినబడ్డాయి. ఇక ఆమె ముఖం మీద గాయాలు ఉండటం వల్ల ఈ వదంతులు ఎక్కువయ్యాయి. అయితే వాణి జయరాం కేసును దర్యాప్తుకు పోలీసులు ఆమె మరణం మీద ఎలాంటి అనుమానాలు లేవంటూ చెప్పారు. సహజంగానే మరణించినట్లు పోలీసులు తేల్చారు. అయినా ఈ విషయంలో ఎన్నో అనుమానాలు అలానే ఉన్నాయి.

లెజెండ్రి సింగర్ వాణి జయరాం…

సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వాణి జయరాం గారి గురించి మాట్లాడుతూ తెలుగు పాటపై ఆమె చెరగని ముద్ర వేసారంటూ అభిప్రాయపడ్డారు. తమిళ గాయని అయినా కూడా తెలుగు ఉచ్చారణలో తడబడలేదని ఎంతో సహజంగా ఆమె తెలుగు ఉందంటూ ఆమె గాత్రం గురించి భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఇక ఆమె మరణం సంగీత ప్రియులకు తీరని లోటు అంటూ, అయితే ఆమె మరణం పట్ల ఇంత చర్చ అవసరం లేదంటూ చెప్పారు. వాణి జయరాం గారికి పిల్లలు లేరు ఒంటరిగా జీవిస్తున్నారు. చనిపోయిన రోజు కూడా ఆమె దురదృష్టవశాత్తు పడిపోవడం వల్ల ముఖానికి గాయాలు అయ్యాయని, శబ్దం రావడంతో వెంటనే పని మనిషి గదిలోకి వెళ్లి చూసి బంధువులకు ఫోన్ చేసిందని పోలీసులు వివరించారు.

ఇక అనుమానస్పదంగా ఎలాంటి విషయాలు లేవని అంతకు ముందు ఇంటి వద్ద ఎవరైనా అనుమానస్పదంగా తిరిగినది కూడా లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా కూడా ఆమెది సహజ మరణం అని తెలిపినట్లు భరద్వాజ గారు వివరించారు. అలాంటవుడు ఆమె మృతి పట్ల అనుమానాలను వ్యక్తపరుస్తూ చర్చిస్తూ రచ్చచేయడం తగదు, ఆమె ఒక లెజెండ్రి సింగర్ ఆమె భౌతికంగా దూరమైన పాటల ద్వారా సజీవంగా ఉంటారు అంటూ ఆమె మరణం గురించి చర్చ జరపకపోవడం మంచిదంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago