Senior journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ అనగానే గొప్ప పౌరణికాలు, అలాగే జానపద చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన ఆ జోనర్స్ లో మరెవరూ సాహసించినటువంటి చిత్రాలను తన నటనతో రక్తి కట్టించారు. అప్పట్లో జానపదాలు, పౌరణికలు అంటే ఎన్టీఆర్, సాంఘిక చిత్రాలంటే ఏఎన్ఆర్ అనేలా వారి సినిమాలు సాగేవి. కానీ సాంఘిక సినిమాల్లో కూడా నేను మిన్న అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. వయసుమల్లిన పాత్రలో కనిపించి రిస్క్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన గురించి తెలిసిన ఎవరైనా ఆయన క్రమశిక్షణ ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువచ్చిందని భావిస్తారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఆహారపు అలవాట్ల గురించి ఆయనను దగ్గర నుండి చూసిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి… మాంసాహార ప్రియుడు…
ఎన్టీఆర్ గారు మొదటి నుండి క్రమశిక్షణ తో జీవించారు. షూటింగ్ ఎన్నింటికైనా కరెక్ట్ టైంకి అక్కడ ఉండేవారు. ఇతరులు లేట్ వచ్చినా దండించేవారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఇమంది గారు మాట్లాడుతూ ఆయన ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అనగా రెండున్నర, మూడు గంటల ప్రాంతంలో లేచి మొదట్లో వ్యాయామలు చేసేవారు. అయితే కొన్నేళలకు వయసు కొంచెం పెరిగాక వాహిని స్టూడియో నుండి వచ్చే పహిల్వాన్ తో మసాజ్ చేయించుకుని ఆ తరువాత స్నానము చేసి నిర్మాతలతో దర్శకులతో కొత్త కథల గురించి చర్చించేవారట. ఒక లంక చుట్ట కాల్చడం బాగా అలవాటు ఉండేదట రామారావు గారికి. ఇక వారితో చర్చల్లో ఉన్నపుడే బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీలు, ఇడియాప్పం లాంటివి తినేవారు అంటూ చెప్పారు. ఇడియాప్పం అంటే చాలా ఇష్టం అంటూ ఇమంది గారు చెప్పారు.
పక్షి మాంసం అంటే చాలా ఇష్టం, ఉదయం అల్పాహారంలో పక్షి మాంసం ఖచ్చితంగా తినేవారు. ఇక డ్రై ఫ్రూట్స్ పాలతో కూడిన జ్యూస్ ఒక లీటర్ తాగి ఇక ఆపై షూటింగ్ కి ఆరోజు కావాల్సిన పాత్రకు తగ్గ మేకప్ అలాగే డ్రెస్సింగ్ చూసుకుని బయలుదేరాక ఇక ఆయనను చూడటానికి వచ్చిన వారిని కలిసి మాట్లాడిన తరువాత బసవతారకం గారు పసుపు నీళ్లు దిగదీసిన తరువాత భూత రాజు అనే వ్యక్తి దిష్టి తీసాక అప్పుడు ఆయన షూటింగ్ వెళ్ళేవారు. పౌరానిక పాత్రలు వేసినపుడు మాత్రం మాంసం ముట్టేవారు కాదు అంటూ ఎంతో నిష్టగా ఉండేవారు అంటూ చెప్పారు ఇమంది గారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…