Shahrukh Khan: బాలీవుడ్ సీనియర్ నటుడు షారుక్ ఖాన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయితే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మాత్రం తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా అస్సాం ముఖ్యమంత్రి తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అస్సాం ముఖ్యమంత్రి తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదని చెప్పడానికి కారణం లేకపోలేదు.
షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానుంది. ఈక్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన బేషరం రంగ్ సాంగ్ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసింది.ఈ క్రమంలోనే పలువురు సిని రాజకీయ నాయకులు ఈ సినిమా పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయితే అస్సాంలో నారేంగి థియేటర్లో కొంతమంది బజరంగ్ దల్ ఈ సినిమా విడుదల చేయడానికి వీలు లేదంటూ నిరసన వ్యక్తం చేయగా మరోవైపు షారుక్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా విడుదల కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ఓ సమావేశంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రిని ప్రశ్నించగా ఆయన షాకింగ్ సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ… షారుక్ ఖాన్ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. షారుక్ ఖాన్ ఎవరు తన సినిమాలు ఏంటో అనే విషయాలు తనకు ఏ మాత్రం తెలియదంటూ ఈయన తెలియజేశారు.ఈ విషయం గురించి ఇప్పటికే తనకు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఫోన్ చేశారు. కానీ ఈ షారుక్ ఖాన్ ఎవరో తనకు ఫోన్ చేయలేదని, ఆయన ఫోన్ చేసి విషయం చెబితే అప్పుడు పరిశీలిస్తామని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…