Shahrukh Khan: బాలీవుడ్ సీనియర్ నటుడు షారుక్ ఖాన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయితే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మాత్రం తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా అస్సాం ముఖ్యమంత్రి తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అస్సాం ముఖ్యమంత్రి తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదని చెప్పడానికి కారణం లేకపోలేదు.

షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానుంది. ఈక్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన బేషరం రంగ్ సాంగ్ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసింది.ఈ క్రమంలోనే పలువురు సిని రాజకీయ నాయకులు ఈ సినిమా పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయితే అస్సాంలో నారేంగి థియేటర్లో కొంతమంది బజరంగ్ దల్ ఈ సినిమా విడుదల చేయడానికి వీలు లేదంటూ నిరసన వ్యక్తం చేయగా మరోవైపు షారుక్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా విడుదల కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ఓ సమావేశంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రిని ప్రశ్నించగా ఆయన షాకింగ్ సమాధానం చెప్పారు.

Shahrukh Khan:షారుక్, అతని సినిమాల గురించి నాకు తెలియదు..
ఈ సందర్భంగా హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ… షారుక్ ఖాన్ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. షారుక్ ఖాన్ ఎవరు తన సినిమాలు ఏంటో అనే విషయాలు తనకు ఏ మాత్రం తెలియదంటూ ఈయన తెలియజేశారు.ఈ విషయం గురించి ఇప్పటికే తనకు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఫోన్ చేశారు. కానీ ఈ షారుక్ ఖాన్ ఎవరో తనకు ఫోన్ చేయలేదని, ఆయన ఫోన్ చేసి విషయం చెబితే అప్పుడు పరిశీలిస్తామని తెలిపారు.






























