Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?
Shalini Pandey: షాలిని పాండే అంటే టక్కున గుర్తు రాకపోయినా అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే అందరికీ ప్రీతి పాత్రలో నటించిన ఈ హీరోయిన్ టక్కున గుర్తుకు వస్తారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలిని పాండే మొదటి సినిమాతోనే ఎంతో మంది యువతను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈమె ఒక్కసారిగా యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండతో కలిసి ఈమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఈ లిప్ లాక్ సన్నివేశాలతో యువతను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలకు ముందు వరకు ఏ విధమైనటువంటి అంచనాలు లేకపోయినా ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షోతోనే అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ యువతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలకు క్రష్ అయ్యారు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమా అవకాశాలను అందుకోని ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటించే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ టాప్ హీరోగా కొనసాగుతున్నారు.
ఇక అందరిలాగే షాలిని పాండే కూడా మొదటి సినిమాతోనే యువతను ఎంతో ఆకట్టుకోవడంతో ఈమెకు కూడా వరుస అవకాశాలు వస్తాయని భావించారు.అయితే ఈమె అనుకున్న విధంగా తనకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదు.కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో ఓ కీలక పాత్రలో షాలిని నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు దూరమైన షాలిని బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.అర్జున్ రెడ్డి సినిమాలో ఎంతో బొద్దుగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సన్నజాజి తీగల మారిపోయారు. ఈ క్రమంలోని ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అసలు అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలినినేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…