వామ్మో.. చరణ్ – శంకర్ సినిమాలో ఆ సన్నివేశం కోసం 45 కోట్లా!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా వున్నారు.టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50 వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్ర బృందం ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు. సినిమాలు కేవలం ఏడు నిమిషాల సీన్ కోసం దాదాపుగా 67 కోట్లు ఖర్చు చేసారట.

ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సెట్ లో రామ్ చరణ్, కియారా అద్వాని కాంబోలో ఒక రొమాంటిక్ సీన్ ను చిత్రీకరిస్తున్నారట. ఇందు కోసం భారీ సెట్ వేయడానికి 40 కోట్లు ఖర్చు చేశారట. వీటితో పాటుగా ఒక పాటను కూడా చిత్రంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో కేవలం రెండు షెడ్యూల్స్ కె 112 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కోసం మరో 1.73 కోట్లు ఖర్చయింది. ఇలా సినిమా పూర్తి కాకముందే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక సినిమా పూర్తయ్యే సరికి మరింత ఖర్చు అవుతుందో, అంతేకాకుండా ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.