Shekhar Master : బ్యాక్ గ్రౌండ్ డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసి ప్రస్తుతం కోరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు శేఖర్ మాస్టర్. అటు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తూ హిట్స్ ఇస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. ముఖ్యంగా ఈటీవీ లో వస్తోన్న ఢీ డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఆ షోలో మొదలు పెట్టి జడ్జిగా కొనసాగుతూ అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఈటీవీ నుండి వెళ్ళిపోయి మా టీవీ లో కామెడీ స్టార్స్ కామెడీ షోలో నాగబాబు తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తన డాన్స్ కంపోజిషన్ కి సినిమాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
ల్యాండ్ విషయంలో మోసపోయాను…
పెళ్ళికి ముందు నుండే డబ్బు పొదుపు చేసుకుని ఆ డబ్బును భూమి మీద పెట్టుబడి పెట్టాలని అలా దాచుకున్న డబ్బుతో స్థలం కొని అది అమ్మి కొంత లాభం తీసుకున్నాను. ఇక ఈ మధ్యనే మళ్ళీ ఒక ల్యాండ్ తెలిసిన స్నేహితుల బంధువే అవడంతో అప్పు తెచ్చి మరీ స్థలం కొనడానికి డబ్బు ఇచ్చాను. హైదరాబాద్, విజయవాడ హైవేలో స్థలం అని చెప్పారు. నమ్మి ఇస్తే లాక్ డౌన్ లో రేట్లు పడిపోయాయి అంటున్నారు. పోనీ ఎంతొస్తే అంత ఇవ్వండి అని అడిగినా ఇప్పటికి ఇవ్వలేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. ఇక కొంత కాలంగా నా ఫోన్ కి కూడా వాళ్ళు స్పందించడం లేదు అంటూ చెప్పారు. ఇక విజయవాడలో పెద్దగా పరిచయం లేని వ్యక్తి నాకు ల్యాండ్ చూపించాడు. ఆ ల్యాండ్ కొని అమ్మిన డబ్బులతో ఇక్కడ మళ్ళీ ల్యాండ్ కొనుకున్నాను. అలా తెలిసిన వాళ్ళు నన్ను మోసం చేసారు. ఎవరో తెలియని వ్యక్తి నాకు మంచి చేసాడు అన్నాడు.
శ్రీముఖి ముద్దుల విషయంలో నాకు సంబంధం లేదు…
జబర్దస్త్, ఢీ లలో కనిపిస్తూ ఇక అప్పుడప్పుడు పండగ ఈవెంట్లలో సందడి చేస్తుండే శేఖర్ మాస్టర్ అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తారంటూ సరదాగా అనేవారు. ఇక రోజా, అనసూయ, రష్మీ లతో డాన్స్ చేసినా కామెంట్స్ చేసేవాళ్ళు. అలా ఒకసారి పాటకు శ్రీముఖితో డాన్స్ చేస్తుంటే అనుకోకుండా తాను ముద్దు పెట్టేసింది. ఇక అది బాగా వైరల్ అయింది, అసలు ఆ ముద్దులకు నాకు ఏం సంబంధం లేదు పాటలో అలా అనుకోకుండా చేసేసింది అని వివరించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…