Shivabalaji -Madhumitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యమైన జంటగా గుర్తింపు పొందిన శివ బాలాజీ మధుమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఇంగ్లీష్ కారన్ ‘ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇలా ఇద్దరు కూడా నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.
ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకొని ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. ఇద్దరూ కూడా ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ తమ ప్రేమ పెళ్లి వరకు రావడానికి ఎదురైన ఆటంకాల గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ క్రమంలో మధుమిత మాట్లాడుతూ ..” శివ బాలాజీ నాలుగేళ్ల పాటు నన్ను ప్రేమించి తీరా పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత నాకు బ్రేకప్ చెప్పాడు అని తెలిపింది. ఇరు కుటుంబాలు పెళ్ళికి అంగీకరించిన తర్వాత ఒకరోజు శివ బాలాజీ ఫోన్ చేసి.. మన జాతకాలు కలవలేదు . నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుంది. అందుకే నిన్ను పెళ్ళి చేసుకోలేని చెప్పాడు.
ఆ క్షణంలో గుండెలు పగిలేలా ఏడ్చాను అంటూ మధుబాల తెలిపింది. మనం ఫ్రెండ్స్ లాగా ఉందామని శివ బాలాజీ అడిగినా కూడా నేను నో చెప్పాను ఎందుకంటే నేను అతన్ని భర్తగా మాత్రమే ఊహించుకున్నాను. మా అమ్మ నాన్నలకు జాతకాల గురించి పట్టించుకోలేకపోయినా కూడా అత్తమ్మ వాళ్ళు జాతకాలను చాలా నమ్ముతారని తెలిపింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి మల్లి బాలాజీ తన తల్లిదండ్రులను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…