Shoaib akhtar : మొన్న ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో ఇండియా, పాకిస్థాన్ మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఇండియా ను గెలిపించి మ్యాజిక్ చేసాడు. అయితే చాలా రోజుల తరువాత ఉత్కంటభరితంగా జరిగిన మ్యాచ్ అందరికీ నచ్చింది. టీం ఇండియా మీద అందరూ ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ను కామన్ జనాలతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో టెన్షన్ గా చూసారు. చాలా ఏళ్ల తరువాత ఇలాంటి ఒక ఉద్వేగభరిత మ్యాచ్ చూశామంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక ఇండియన్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్య ను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం పూర్తి భిన్నంగా కామెంట్స్ చేసాడు.
పాక్, ఇండియా ఇద్దరూ ఓడిపోడానికి చాలా కష్టపడ్డారు…
పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో వేదికగా ఇరు జట్ల ప్రదర్శన బాగోలేదని ఓడిపోడానికి చాలా కష్టపడ్డారు, అయితే హార్దిక్ పాండ్య మాత్రమే ఇండియా టీం ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి ఇండియాను గెలిపించాడు అంటూ కామెంట్ చేసాడు. నిజానికి మ్యాచ్ జరిగిన రోజును బ్యాడ్ డే గా వర్ణించాడు షోయబ్ అక్తర్. దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఈ మాటలు మీకు నచ్చకపోవచ్చు నేను ఎవరినీ అవమానించడమే లేదు అంటూ అయన వివరణ ఇచ్చారు.
బాబర్ అజమ్ని ఓపెనింగ్కు తీసుకోవద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఫఖర్ జమాన్- రిజ్వాన్ కలిసి ఓపెనింగ్ కి వస్తే, బాబర్ వన్ డౌన్లో వచ్చి కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది. భారత్ కూడా జడేజాను నాలుగో స్థానంలో పంపింది. రెండు జట్లు కూడా బ్యాడ్ క్రికెట్ను ఆడాయి. ఇరు జట్లు దారుణమైన క్రికెట్ ఆడాయి, అంటూ కామెంట్స్ చేసారు. ఇవే కాకుండా మహమ్మద్ రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేసాడు ఇది ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. డాట్ బాల్స్ ఎక్కువ ఆడటం ప్రమాదకరం. పాక్ ఆడినపుడు తొలి 6 ఓవర్లలో 19 డాట్ బాల్స్ పడ్డాయి. ఇక ఇండియా టీం లో రిషబ్ ను పక్కన పెట్టి తప్పు చేసింది, ఇక పాక్ ఏమో ఇఫ్తార్ అహమ్మద్ ను నాలుగో ప్లేసులో లో పంపి తప్పు చేసిందిఅంటూ చెప్పారు. మొత్తానికి మ్యాచ్ డే ను బ్యాడ్ డే గా వర్ణించాడు.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…