Karthikeya 2: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.
ఇక ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన టాలీవుడ్ సినిమాలలో టాప్ టెన్ పొజిషన్లో పేరు సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా విజయం పై గుజరాత్ ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఇలా ఎంతో విజయవంతంగా ఈ సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్లోనే ప్రముఖ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేశారు.
హైదరాబాద్ లోని ఆర్టిసి క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న ‘కార్తికేయ 2’ చిత్రానికి చిన్న బ్రేక్ వేయబోతున్నారు. ఇలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి బ్రేక్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది.సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ఒకటవ తేదీ స్పెషల్ షోలో భాగంగా జల్సా సినిమాని ఈ థియేటర్లో విడుదల చేయనున్నారు.
ఈ విధంగా జల్సా సినిమా ప్రదర్శన నిమిత్తం కార్తికేయ సినిమాకు బ్రేక్ పడింది.ఇక ఈ స్పెషల్ షో అనంతరం యధావిధిగా కార్తికేయ సినిమా ప్రదర్శన అవుతుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి థియేటర్ యాజమాన్యంతో అనుమతి కూడా తీసుకున్నట్లు వెల్లడించారు కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కోసమే కార్తికేయ సినిమాకు కాస్త విరామం ఇచ్చారని తెలుస్తోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…