Shoaib Akthar : టీం ఇండియా సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బలు తిని బయటికి వచ్చింది. ఇక మ్యాచ్ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే చెత్త ప్రదర్శన వల్ల అందరి నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా తరచూ ఏవో ఒక కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఉండే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీం ఇండియా మీద కామెంట్స్ చేసాడు. చెత్తగా ఆడారు అంటూ విమర్శించేసాడు. దొరక్క దొరక్క అవకాశం దొరికింది కదా అని ఇండియన్ టీంలో లోపాలు ఉన్నాయి, మంచి పేసర్ లేడు అంటూ హాట్ కామెంట్స్ చేసాడు.
మీ ప్రదర్శన చెండాలంగా ఉంది… మీతో ఫైనల్ ఆడాలనుకుంటే…
భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ లో 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కేవలం ఇద్దరే పదహారు ఓవర్లలో వీరబాదుడు బాది అయిపోగొట్టారు. వారి దూకుడికి కళ్లెం వేయలేక పోయారు భారత బౌలర్లు. ఇంగ్లాండ్ ఓపెనర్లైన బట్లర్, అలెక్స్ కలిసి గేమ్ ముగించేసారు. నిజానికి ఇండియన్ టీంలో చాలా లోపలున్నా బాగానే ఆడి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు. అయితే ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. షోయబ్ ట్విటర్ ద్వారా ఇండియా ఆటతీరులోని లోపాలను కామెంట్స్ చేసాడు.
భారత్ చాలా చెత్తగా ఆడింది, చెండాలంగా ఓడింది. బౌలింగ్లో ఏ మాత్రం పస లేదు. అసలు చాహల్ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు, ఇండియన్ టీం సెలెక్షన్ సరిగా లేదు. ఆస్ట్రేలియా అంటేనే పేస్ బౌలింగ్కు పెట్టింది పేరు అలాంటిది జట్టులో ఒక్క మంచి పేసర్ లేడు. పిచ్ అనుకూలిస్తే తప్ప టీం లోని బౌలర్లు వికెట్లు తీయలేరు, అసలు వికెట్లు తీద్దామనే ఉద్దేశమే వారిలో కనిపించలేదు. వికెట్లు పడకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు ఫ్రీగా ఆడుతుంటే, కనీసం బౌన్సర్లు వేయడమో.. వారిని ఏదో ఒకటి అని డిస్టబ్ చేయడమో ఏమీ చేయలేదు. ఇంగ్లాండ్ ఐదు ఓవర్లు ఆడగానే భారత్ చేతులెత్తేసింది, మీతో కలిసి ఐసీసీ ఫైనల్స్ ఆడాలనుకుంటే ఇలా చేసారు అంటూ వీడియో పోస్ట్ పెట్టాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…