Actress Sneha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్నేహ అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరుపొందారు. సౌందర్య మరణం తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె అచ్చం తనకట్టు బొట్టు నటనతో సౌందర్యను తలపించారు. అయితే సౌందర్య మాదిరిగా ఇండస్ట్రీలో స్నేహ ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. అతి తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయ్యారు.
ఇకపోతే హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం హీరో వదిన అక్క పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే తమిళ హీరో ప్రసన్నకుమార్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో 2012 మే 11వ తేదీ ఈ దంపతులు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి స్నేహ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఏ కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు జంటగా వెళ్లి చూడముచ్చటగా అనిపించే స్నేహ దంపతుల గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గత కొంతకాలం నుంచి స్నేహ తన భర్త ప్రసన్నకుమార్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తన భర్తకు దూరంగా పిల్లలతో కలిసి స్నేహ ఉంటుందని తెలియడంతో ఈ దంపతుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగానే విడిగా ఉంటున్నారని, ఇలా విడిగా ఉన్నటువంటి ఈ జంట వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకొని ఒకటవతార లేకపోతే విడాకులు తీసుకొని తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా అని పెద్ద ఎత్తున నేటిజెన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే స్నేహ స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…