ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పలు సంక్షేమ పథకాలతో పాటు.. ప్రతీ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చూపుతూ పాలన సాగిస్తున్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం.. ఆ ఫలితాన్ని ఇటీవల జరిగిన 13 మున్సిపల్ ఎన్నికల్లో చూశారు.
ఒక్క మున్సిపాలిటీ తప్ప అన్నీ కైవసం చేసుకున్నారు. ఈ ఘనత అంత ప్రజలదే అని.. వాళ్లు తమకు 100 కు 97 మార్కులు ఇచ్చారని.. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. కడప జిల్లాలోని వైసీపీ సర్పంచ్ లు మూక్కుముడిగా రాజీనామా చేశారు. ఇది ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మరింది.
మంచి జోష్ లో ఉండి.. ముందుకు దూసుకపోతున్న వైసీపీకి ఇది పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. అసలెందుకు వాళ్లు ఈ పిని చేశాడు.. అసలేమైందంటే.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో 13 మంది వైసీపీ సర్పంచులు ఒకేసారి రాజీనామా చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని.. చేతి నుంచి డబ్బులను పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని అన్నారు. ఇంకా చాలామంది రాజీనామాలకు సిద్ధ పడ్డారని.. ప్రభుత్వంపై రాజీలేని పోరాటానికి తాము సిద్ధం అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…