Shruthi Hassan: వెండితెర నటిగా పలు సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు. క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ చిరంజీవి హీరోలుగా నటించిన వీర సింహారెడ్డి,వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా రెండు సినిమా విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వాల్తేరు వీరయ్య లో నటించిన ఓ పాట గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలోను మంచు కొండల్లో పాటలను చిత్రీకరించడం సర్వసాధారణం. వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఇలా మంచుకొండల్లో ఓ పాటను చిత్రీకరించారు. ఇలా మంచు కొండల్లో మంచు కురుస్తున్న సమయంలో పాటలను చిత్రీకరించడం చాలా కష్టం అంటూ ఈమె చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ ఇలాంటి పాటలలో నటించే సమయంలో హీరోలకు జాకెట్స్ వేస్తారు.
ఇక హీరోయిన్లకు కనీసం కోట్,సాలువ వంటివి కూడా ఇవ్వరని కేవలం చీర జాకెట్ తో మంచు కురుస్తున్న సమయంలో గడ్డకట్టే చలిలో కూడా డాన్స్ చేయాల్సి వస్తుందని తెలిపారు. దయచేసి హీరోయిన్ల పట్ల ఇలాంటివి ఆపండి,తాజాగా తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…