Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది ఏకంగా వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీని ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా పెళ్లికి ముందే తల్లి కావడం గురించి మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. అయితే ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ పెళ్లికి ముందే తల్లి అయితే తప్పేంటి…కేవలం ఆడవారు మాత్రమే పిల్లలకు జన్మనివ్వగలరు అయితే ఎప్పుడు పిల్లలకు జన్మనివ్వాలి అన్నది పూర్తిగా వారి నిర్ణయమేనని శృతిహాసన్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే శృతిహాసన్ సైతం పెళ్లికి ముందే జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు ఈమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ హద్దులు దాటి తనపై ట్రోల్స్ చేస్తున్నారు.ఇలా శృతిహాసన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినప్పటికీ తాను తన గురించి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని ఒకప్పుడు ఈ విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేదాన్ని కానీ ఇప్పుడు వాటి గురించి అస్సలు ఆలోచించను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…