Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈయన నాగచైతన్య జోష్,రామ్ చరణ్ ఆరంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అనంతరం గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన డిజె టిల్లు సినిమా ద్వారా మంచి హిట్ కొట్టారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరి కొన్ని సినిమాలకు.కూడా ఈయన కమిట్ అయినట్లు తెలుస్తుంది.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సిద్దు ఇప్పుడు ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో హీరోగా సినిమా చేయబోతున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని SVCC పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారు..అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలను కూడా తెలియజేయబోతున్నట్లు సమాచారం.ఇక బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా హిట్ అందుకున్న అనంతరం సిద్దు జొన్నలగడ్డతో సినిమాకు కమిట్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…