ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులలో ఆటోలో లేదా బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఎక్కువమంది ద్విచక్ర వాహనాలలో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ చూపు ఎలక్ట్రానిక్ వాహనాలు పై పడింది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ ఏర్పడటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ చేరింది. సింపుల్ ఎనర్జీ సంస్థ తన మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఇ-స్కూటర్ను ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
మార్క్ 2 పేరుతో మార్కెట్లోకి విడుదల కానున్న ఎలక్ట్రానిక్ స్కూటర్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.దీనిలో 4.8 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. టచ్ స్క్రీన్, ఆన్-బోర్డు నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ బండి ప్రత్యేకం.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఫ్లాగ్షిప్ ఇ-స్కూటర్ ధర రూ.1,10,000 నుండి రూ. 1,20,000 వరకు ఉంటుందని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఈ సందర్భంగా సింపుల్ ఎనర్జీ ఫౌండర్ మాట్లాడుతూ భారత మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ ఈ–స్కూటర్ను విడుదల చేయనుండటం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…