Featured

సింపుల్ ఎనర్జీతో ఇ-స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే?

ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులలో ఆటోలో లేదా బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఎక్కువమంది ద్విచక్ర వాహనాలలో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ చూపు ఎలక్ట్రానిక్ వాహనాలు పై పడింది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ ఏర్పడటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్​ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ చేరింది. సింపుల్ ఎనర్జీ సంస్థ తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ను ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మార్క్ 2 పేరుతో మార్కెట్లోకి విడుదల కానున్న ఎలక్ట్రానిక్ స్కూటర్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.దీనిలో 4.8 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. టచ్ స్క్రీన్, ఆన్-బోర్డు నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ బండి ప్రత్యేకం.

ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ ధర రూ.1,10,000 నుండి రూ. 1,20,000 వరకు ఉంటుందని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఈ సందర్భంగా సింపుల్ ఎనర్జీ ఫౌండర్ మాట్లాడుతూ భారత మార్కెట్​లో సరికొత్త ఎలక్ట్రిక్​ ఈ–స్కూటర్​ను విడుదల చేయనుండటం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago