ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండల పర్యటనలో జరిగిన దుర్ఘటనపై మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామం వద్ద జరిగిన ఈ ఘటనలో, సింగయ్య అనే వ్యక్తి సీఎం జగన్ కాఫిల్లో ఉన్న ఓ వాహనం కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైరల్ అయిన వీడియోలో స్థానికులు “వ్యక్తి కింద పడ్డాడు” అని ఎంతగా అరిచినా వాహనం ఆగకుండా ముందుకు సాగిన దృశ్యం కనిపిస్తోంది.
వీరాభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా జగన్ వాహనం ముందు దూసుకొచ్చారు. అపసవ్యతగా ఏర్పడిన తొక్కిసలాటలో సింగయ్య అనే వ్యక్తి వాహనం ముందు టైర్ కిందకి పడిపోయారు. అతడిని తొక్కి ఓ టాటా సఫారీ (AP 26 CE 0001) వెహికల్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందిస్తూ, “సింగయ్య కుటుంబం నుండి ఫిర్యాదు వస్తే, విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ప్రజలు విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “ఒక వ్యక్తి ప్రాణం పోయిందని తెలిసినా వాహనం ఆగకుండా ముందుకెళ్లడం.. ప్రాణం అంటే ఎంత నిర్లక్ష్యం?” అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సింగయ్య కుటుంబానికి న్యాయం జరగాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…