Mangli: సెలబ్రిటీ హోదా వస్తే ఒక బాధ.. రాకపోతే మరో బాధ. ఎవరైనా సెలబ్రిటీ కావాలనే కోరుకుంటారు. దానికి తగ్గట్లు అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే తెలంగాణ జానపదం..షెడ్యూల్ తెగలు, లంబాడీలకు సంబంధించి పాటలను పాడటంతో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్న సింగర్ మంగ్లీ. తీన్మార్ లో ఒక జర్నలిస్ట్ గా ఆమె టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం.
తర్వాత సినిమాల్లో పాటలు పాడుతూ.. పండుగల నేపథ్యంలో .. ఆ పండుగ యొక్క కీర్తిని.. విశేషాలను పాటల రూపంలో ఆమె పాడుతూ.. మంగ్లీ అంటే ఏంటో నిరూపించుకుంది. అయితే ఆమె పాడే పాటల్లో లిరిక్స్ కు సంబంధించి కొన్ని పదాలు కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని చాలాసార్లు వివాదాల్లోకి కూడా వచ్చారు. ఇలా ఆమె పెద్ద సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. చిన్న చితకా సినిమాల్లో కూడా నటిస్తోంది.
అయితే తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే.. అయితే ఈ మధ్య సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కారణం కరోనా కాదు . అభిమానులు. అవును.. అభిమానుల కారణంగా సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్కి వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్స్ కావడంతో అక్కడ సెల్ఫీలతో విసిగిపోతున్నారు.
అలాంటిదే తాజాగా సింగర్ మంగ్లీ విషయంలో కూడా ఇలానే జరిగింది. సెల్ఫీలతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆమె మంత్రి కుమార్తె వివాహ రిసెప్షన్కు వచ్చింది. దీంతో మంగ్లీతో సెల్ఫీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఫోటోల కోసం అభిమానులు ఒక్కసారిగా హంగామా చేయడంతో మంగ్లీ తట్టుకోలేకపోయింది. ఇక అక్కడి యువకుల తీరుతో మంగ్లీ కలవరపడింది. ఇదేం పద్దతి అని మండిపడింది. ఈ సెల్ఫీలతో ఇబ్బంది పడటం మంగ్లీ ఒక్కరే కాదు.. గతంలో చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరిగింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర కార్యక్రమాలకు వెళ్లిన అభిమానులు.. అక్కడకు వచ్చిన సెలబ్రిటీతో సెల్ఫీలను దిగాలనే ఆశతో ఉంటూ.. వచ్చిన సెలబ్రిటీకి అసహనం తెప్పిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మంగ్లీ వీడియో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…