Featured

Singer Smitha : ఇంద్ర భవనం లాంటి ఇల్లు… వైరల్ అవుతున్న స్మిత హోమ్ టూర్ వీడియో..!

Singer Smitha : తొలి తెలుగు పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించిన స్మిత, ఈటీవీ లో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ‘ఇషా’ సంస్థలో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది.

పాత కాలం పద్దతిలో…

హోమ్ టూర్ వీడియో.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. చిన్న చిన్న సెలబ్రిటీల దగ్గర నుండి బడా సెలబ్రిటీల వరకు వాళ్ల ఇల్లు ఎలావుంటుందో చూడలేని అభిమానుల కోసం అందరూ హోమ్ టూర్ వీడియో చేసి అందరితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కోవలోకే వస్తారు సింగర్ స్మిత. ఆయితే సింగర్ స్మిత ఇల్లు మాత్రం అందరినీ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడరన్ లుక్ వదిలేసి పాతకాలం రూపు రేఖలతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సీలింగ్ పైన కనిపిస్తున్న అష్ట లక్ష్ములు, దశవతారం సంబందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

ఇంటిలోకి వెళ్తూనే కుడివైపు ఉన్న చిన్న గార్డెన్ మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తోంది. ఇక ఇంటిలో స్మిత గారి నాన్నమ్మలు, తాతయ్య కాలం నాటి వస్తువులు ముఖ్యంగా శ్రీ రాముల విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో కనిపించే సీతారాముల కళ్యాణంకి సంబందించిన పెయింటింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా ప్రస్తుతం స్మిత హోమ్ టూర్ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

20 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

21 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

21 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

21 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

24 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

24 hours ago