తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తియ్యని గాత్రం తో ఎన్నో మధురమైన పాటలను పాడి ఎంతోమంది తెలుగు వారిని ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది మొదటలో సునీత రామ్ వీరపనేని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంతకుమునుపు మనం ఎన్నడూ చూడని సునీతను చూస్తున్నాము.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా బుల్లితెరపై డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చిన సునీత తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం బయట ఉన్న భయాందోళన పరిస్థితులను గురించి తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలోనే నిన్న రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వచ్చిన సునీత అభిమానులు అడిగిన పాటలను పాడుతూ అందరిని సంతోష పెట్టారు. ఈ క్రమంలోనే సునీత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇలా చెబితే అందరికీ కోపం వస్తుంది. కానీ ఎవరు బయటికి వెళ్లకుండా, తప్పనిసరి అయితే తప్ప తగు జాగ్రత్తలు పాటిస్తూ బయటికి వెళ్ళండి.ఈ విధంగా నేను పాటలు పాడితే కొందరు తమ బాధలను మర్చిపోతారు అంటే ప్రతిరోజు రాత్రి ఇదే సమయానికి ఓ అరగంట మీ కోసం సమయం కేటాయిస్తానని మీకోసం లైవ్ లో పాటలు పాడుతానంటూ అభిమానులకు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…