భూప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కొందరు తెలివితో సులభంగా డబ్బు సంపాదిస్తే మరి కొందరు మాత్రం ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేక పోతున్నామని బాధ పడుతూ ఉంటారు. అయితే డబ్బును సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా కోటీశ్వరులు కావచ్చు. అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే కొన్నిసార్లు లాభాలు సొంతమైతే మరికొన్ని సార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో పోస్టాఫీస్ లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా అదిరిపోయే రాబడులను సులువుగా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా కొన్ని చోట్ల పెట్టుబడులు పెడితే ఖచ్చితమైన లాభం వస్తుందనే గ్యారంటీ ఉండదు. అయితే పోస్టాఫీస్ లోని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో మాత్రం ఖచ్చితమైన లాభాలు కూడా పొందవచ్చు. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలపరిమితితో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లను అందిస్తోంది.
ఆర్డీ, కిసాన్ వికాస్ పత్ర, పీపీఎఫ్, ఎన్ఎస్సీ లాంటి స్కీమ్ ల పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వ్యాపారులు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఒక్కో స్కీమ్ లో వడ్డీ రేట్లు ఒక్కో విధంగా ఉంటాయి.
వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ కాలాన్ని బట్టి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు. మోసపూరిత సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవడం కంటే బ్యాంకులు, పోస్టాఫీస్ లలోని స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదిరిపోయే రాబడులను సొంతం చేసుకోవడంతో పాటు అనేక లాభాలను పొందవచ్చు.
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…