ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏ లక్షణాల ద్వారా కరోనా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంత మందికి తీవ్ర జ్వరం తో పాటు దగ్గు, గొంతు నొప్పి వస్తుంది. ఇలా లక్షణాలు కనిపించిన వెంటనే వారు కోవిడ్ టెస్టు చేయించుకుంటున్నారు.కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే దాని తగ్గట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే నెగెటివ్ రిపోర్టు వచ్చిన వాళ్లకు జ్వరం, దగ్గు తగ్గినా గొంతు నొప్పి అనేది బాధ కలిగిస్తుంటుంది. ఎన్ని చిట్కాలు ఫాలో అయినా దానికి మాత్రం ఉపశమనం కలగదు. అయితే ఇలా గొంతులో గరగర సమస్య ఉటే 5 సింపుల్ టిప్స్ అనుసరించడంతో పూర్తిగా తగ్గుతుంది. అవేంటంటే..
గోరు వెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇలా ఉదయాన్నే ఆ నీటిని తీసుకునే సమయంలో అందులో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో గొంతు నొప్పి మాయమవుతుంది.
మరో చిట్కాలో.. అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేస్తే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా అల్లాన్ని మెత్తగా నూరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే గొంతు నొప్పి పత్తా లేకుండా పోతుంది.
పుదీనా ఆకుల ద్వారా కూడా దీనిని నయం చేయవచ్చు. వాటిని మనం తాగే నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి.. ఆకులు తీసేసి వాటర్ తాగితే మంచిది. చివరి చిట్కా ఏంటంటే.. వేడి నీటిలో కొన్ని చామంతి ఆకుల్ని వేసి మరిగించి.. తర్వాత ఆకులను తీసేసి ఆ నీటిని తాగితే ఇక గొంతులో గరగర అనేది ఉండదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…