ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏ లక్షణాల ద్వారా కరోనా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంత మందికి తీవ్ర జ్వరం తో పాటు దగ్గు, గొంతు నొప్పి వస్తుంది. ఇలా లక్షణాలు కనిపించిన వెంటనే వారు కోవిడ్ టెస్టు చేయించుకుంటున్నారు.కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే దాని తగ్గట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే నెగెటివ్ రిపోర్టు వచ్చిన వాళ్లకు జ్వరం, దగ్గు తగ్గినా గొంతు నొప్పి అనేది బాధ కలిగిస్తుంటుంది. ఎన్ని చిట్కాలు ఫాలో అయినా దానికి మాత్రం ఉపశమనం కలగదు. అయితే ఇలా గొంతులో గరగర సమస్య ఉటే 5 సింపుల్ టిప్స్ అనుసరించడంతో పూర్తిగా తగ్గుతుంది. అవేంటంటే..
గోరు వెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇలా ఉదయాన్నే ఆ నీటిని తీసుకునే సమయంలో అందులో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో గొంతు నొప్పి మాయమవుతుంది.
మరో చిట్కాలో.. అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేస్తే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా అల్లాన్ని మెత్తగా నూరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే గొంతు నొప్పి పత్తా లేకుండా పోతుంది.
పుదీనా ఆకుల ద్వారా కూడా దీనిని నయం చేయవచ్చు. వాటిని మనం తాగే నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి.. ఆకులు తీసేసి వాటర్ తాగితే మంచిది. చివరి చిట్కా ఏంటంటే.. వేడి నీటిలో కొన్ని చామంతి ఆకుల్ని వేసి మరిగించి.. తర్వాత ఆకులను తీసేసి ఆ నీటిని తాగితే ఇక గొంతులో గరగర అనేది ఉండదు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…