కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే… మార్చి 23 నుంచి దశలవారీగా పొడిగించుకుంటూ వస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సంస్థలు తప్ప మిగిలినవి అన్ని మూత పడ్డాయి. దీని ప్రభావంతో ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నష్టాల బారిన పడ్డాయి. తాజాగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే… అయితే ఈసారి కొన్ని సడలింపులు కూడా ప్రకటించింది. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసింది. ఆయా జోన్లలో ఉన్న వైరస్ ప్రభావాన్ని బట్టి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ.
ఈ నేపథ్యంలో మే 7 తర్వాత తమ కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాయి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు. ఈ క్రమంలో ఇప్పటికే తమ ఉద్యోగులకు పలు సంస్థలు ఇమెయిల్స్ కూడా పంపించాయి. మే 7 తరువాత సాఫ్ట్ వేర్ కంపెనీ ఓపెన్ అయితే ఎటువంటి జాగ్రత్తలు, కార్యాచరణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఏఏ జోన్లలో నివశిస్తున్నారు అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నాయి. వారు నివసిస్తున్న జోన్లను బట్టి తగు రవాణా సౌకర్యం కల్పించనున్నాయి. ఈ అంశాలపై ఒక ఫారం తమ ఉద్యోగులకు పంపించి డిటేల్స్ నింపి తిరిగి సెండ్ చేయాలని ఈమెయిల్ లో పేర్కొన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…