ఆయన ఓ సినీ కళా కార్మికుడు, తన లక్ష్య సాధనలో నిర్విరామ మేధోమదనం తో విజయాలను తను అందుకోవడమే కాక సినీ నటులను విజయ శిఖరాలను అంచులకు తీసుకువెళ్లి తాను తీసిన చిత్రాలలో 90% విజయవంతమైన చిత్రాలను రూపొందించి, సినీ దర్శకునిగా మకుటం లేని మహారాజుగా ఎదిగారు. ఒక్క ఎన్.టి. రామారావు మినహా ఆ తరం నుంచి ఈ తరం వరకూ అందరితో సినిమాలు తీశాడు.
నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి హీరోలతో హిట్టు, సూపర్ హిట్ లను తీసిన అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి. అక్కినేని నాగేశ్వరరావు-శ్రీదేవి లతో శ్రీరంగనీతులు…శ్రీరంగనీతులు సినిమా షూటింగ్ లో సంబంధించిన నటుడు రాకపోవడం మూలాన కోదండరామిరెడ్డి ఓ చిన్న పాత్రను వేయడం జరిగింది. రాధిక ఏ.ఎన్నార్ తో అనుబంధం సినిమా, కృష్ణం రాజు-జయప్రదల తో ప్రళయ రుద్రుడు, కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్ లో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఆ తర్వాత శోభన్ బాబు-లక్ష్మీ కాంబినేషన్లో ప్రేమ మూర్తులు అలాగే శోభన్ బాబు-సుహాసిని కాంబినేషన్ లో బావ మరదలు, ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాలను రూపొందించారు.
ఆ తర్వాత తరం హీరోలయిన చిరంజీవితో అనేక సినిమాలను రూపొందించారు. ఒక విధంగా చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఖైదీ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. చిరంజీవి రాధిక కాంబినేషన్లో న్యాయం కావాలి, అభిలాష, దొంగ మొగుడు, చిరంజీవి -విజయశాంతి కాంబినేషన్లో చాలెంజ్, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, చిరంజీవి-సుహాసిని కాంబినేషన్ లో రాక్షసుడు, బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ లో భానుమతి గారి అల్లుడు, భార్గవ రాముడు, భలే దొంగ.
నాగార్జున-జుహీచావ్లా కాంబినేషన్లో విక్కీ దాదా, నాగార్జున-మీనా కాంబినేషన్ లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, బొబ్బిలి సింహం,వెంకటేష్-విజయశాంతి కాంబినేషన్ లో సూర్య ఐపిఎస్ మోహన్ బాబు-దివ్యభారతి కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు, రాజశేఖర్ తో రౌడీయిజం నశించాలి మొరటోడు నా మొగుడు వంటి దాదాపు 93 సినిమాలను ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించి హీరోల సక్సెస్ రేటును పెంచిన ఈ దర్శకుడు సెంచరీకి చేరువలో రనౌట్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…